పసిడి పంజా: లక్షన్నర దాటిన బంగారం ధర.. కొనుగోలుదారులకు గట్టి షాక్!హైదరాబాద్‌లో రూ. 1.57 లక్షలు దాటిన తులం బంగారం.. వెండి కూడా అదే బాటలో!

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న అనూహ్య మార్పులు దేశీయంగా పసిడి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం, డాలర్ విలువ క్షీణించడంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఒక్క రోజే తులం బంగారంపై దాదాపు రూ. 1,900 మేర పెరగడం గమనార్హం.

నేటి తాజా ధరలు (ఫిబ్రవరి 15, 2026):
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): హైదరాబాద్‌లో రూ. 1,57,750 కు చేరుకుంది (నిన్నటి కంటే రూ. 1,970 పెరుగుదల).

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,800 పెరిగి రూ. 1,44,600 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర: నగరంలో కిలో వెండి ధర రూ. 2,80,000 వద్ద స్థిరంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top