భృగు మహర్షి

భృగు మహర్షి బ్రహ్మ రూపము లేని అవతారం అసలు నిజానికి చతుర్ముఖ బ్రహ్మ అంటారు, తూర్పు ముఖ తేజం ద్వారా అవతరించిన మానస పుత్రుడైన ప్రజాపతి, ఇంద్రదేవుడు దేవదేవేంద్రుడు, పిల్లలు సప్తర్షులు ఒకరు. మొట్టమొదటి జ్యోతిష్య రచయిత, వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త. భృగు మహర్షి బ్రహ్మహృదయం నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. వాయు పురాణం ప్రకారం భృగువు తమ్ముడైనా న దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.

భృగు వంశావళి
బ్రహ్మ – మానస పుత్రుడు “భృగు మహర్షి”
భృగువు -ఖ్యాతిదేవి (దక్ష ప్రజాపతి పుత్రిక) వారికి 1) దాత 2) విధాత జన్మించారు.
1) దాత – అయతి (మేరు పర్వతరాజు) వారి సంతానం – ప్రాణుండు ప్రాణుండ
2) విధాత – నియతి (మేరు పర్వతరాజు) -వారి సంతానం -మృఖండమహర్షి – మనస్విని (ముద్గల మహర్షి) -వారి సంతానం
మార్కండేయుడు -దూమ్రావతి దేవి (అగ్ని) – వారి సంతానం
శ్రీ మహా విష్ణువు అంశ భావనారాయణుడు (వేద శీర్షుడు) – భద్రావతి దేవి (సూర్య పుత్రిక) – వారి సంతానం
101 మంది ఋషి శ్రేష్టులు (పద్మశాలీ అను బిరుదాంకితులు)
భృగు మహర్షి -పులోమ (కర్థమ ప్రజాపతి) – వారి సంతానం
చ్యవణుడు -1) అర్శిని 2) సుకన్య వారి సంతానం
1) ఔర్వుడు -ప్రమద్వర వారి సంతానం
ఋచిక మహర్షి – సత్యవతి వారి సంతానం
జమదగ్ని మహర్షి – రేణుక దేవి వారి సంతానం
1) కమణ్వత 2) సుశేన 3) వసు 4) విశ్వావసు 5) పరశు రామ (మహా విష్ణువు దశావతారములలో ఒకటి)
భృగు మహర్షి – ఉషనల (ఊర్జ మహా ఋషి) వారల సంతానం 1) జావంతి 2) సుజన్మద్ 3) శుచి 4) కామ 5) మూర్థ్న 6) తాజ్య 7) వసు 8) ప్రభవ 9) అత్యాయు 10) దక్ష్య 11) ఇతివర 12) శుక్రాచార్యుడు (దైత్య గురువు, నవ గ్రహములలో ఒకరు)
శుక్రాచార్యుడు -1) గోమతి 2) ఊర్జ సతి 3) జయంతి అను ముగ్గరు భార్యలు వారల సంతానం 1) చండ, అర్క 2) తార్ష్య, వరుచ 3) దేవయాని
భృగు సంహిత
భృగుమహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు, ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 1 శాతం జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా కాత్యాయనుడు పేర్కొన్నాడు.
పంచ మూర్తులు లేదా చతుర్ముతులు :ఎవరు గొప్ప?
ఒకనాడు సరస్వతి నదీ తీరమున మహర్షులకు సత్క్రతువులు ఆచరించిన పిమ్మట మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయము వచ్చింది. చతుర్ముతులు గుణగణములు, ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, ఈ సమాధానమిచ్చుటకు మహర్షులందరు భృగువు మహర్షి కంటే గొప్ప జ్ఞాని లేడు అని నిర్ణయించుకొని, ఈ సంశయ విషయము నిర్ధారణ చేసుకునేందుకు భృగువుకు తమ సందేహం తెలియజేస్తారు. మహర్షుల నిజ దైవము ఎవరో తెలుసుకునేందుకు సూర్య బ్రహ్మ, ఇంద్ర బ్రహ్మ, విష్ణు బ్రహ్మ, శివ బ్రహ్మ, దగ్గరకు వెళ్లడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవముతో నశించడము, ముకుందుడు నుండి ఆనందం పొందడము జరిగి భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు.మహర్షులకు పుండరీకాక్షుడు/విష్ణువు ఒక్కడే దైవమని తెలియజేస్తాడు.
భగవద్గీత భృగు ప్రస్తావన
భగవంతుడు శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతలో మహర్షుల గురించి తెలియజేస్తూ ఈ భృగు మహర్షి [6] ప్రస్తావన కూడా రావడము జరుగుతుంది.
1. భృగువు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. కొందఱు వరుణుని యజ్ఞమందలి అగ్నినుండి ఇతఁడు పుట్టినట్లు చెప్పుదురు. ఇతని పుత్రుఁడు కవి. పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు. ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి. ప్రాణుని కొడుకు వేదశిరుఁడు. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు. ఇతని మీసములను దక్షయాగమున వీరభద్రుఁడు పెఱికివేసినట్లు పురాణముల వలన తెలియవచ్చుచున్నది. 2. భృగువు ఒక మహర్షి. ఇతఁడు భాగీరథీ దక్షిణ తీరమున మహాపద్మము అనియెడు పురమునందు ఉండెను. ఇతఁడు ఒకప్పుడు అగ్నిహోత్రము చేయుటకు తన భార్య పులోమను అగ్నులను ఏర్పఱపుము అని ఆజ్ఞాపించి తాను స్నానము చేయుటకై నదికిపోయెను. అప్పుడు పులోముడు అను దానవుఁడు ఒకఁడు అచ్చటికి వచ్చి అగ్నిదేవునివలన ఆమె ఇతని భార్య అని ఎఱిఁగి ఆమెను ఎత్తుకొనిపోవ యత్నింపఁగా వెఱపుచేత పూర్ణ గర్భిణి అయిన అమె తత్తఱపడునపుడు గర్భము భేదిల్లి గర్భస్రావము అయ్యెను. ఆస్రావమైన పిండము చ్యవనుడు అనఁబరఁగిన ఋషి అయి తన కోపపు చూపు చేతనే ఆరక్కసుని భస్మము చేసెను. ఇది అంతయు భృగుమహర్షి ఎఱిఁగి అగ్నిమీఁద అలిగి అతనిని సర్వభక్షకుఁడవు కమ్ము అని శపియించెను. అట్లైనను బ్రహ్మ అగ్ని యొక్క శుచిత్వమునకు లోపము కాకుండునట్లు అనుగ్రహించెను.

News by : V.L