
శ్రీ హనుమాన్ శోభా యాత్ర కమిటీ ఆధ్వర్యంలో 22 – 5 – 2025 గురువారం తెనాలి మార్కెట్ యార్డ్ సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి స్వరాజ్ టాకీస్ వద్ద గల ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు బైక్ రాలి నిర్వహించ బడుతుంది అని కమిటీ సభ్యులు సమయపురం సురేష్ ఒక ప్రకటనలో తెలియచేసారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం అయ్యే ఈ రాలి లో తెనాలి ప్రముఖులు, రాజకీయ నాయకులు వేలాది సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొంటారని తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ బైక్ రాలి లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని శ్రీ హనుమాన్ శోభా యాత్ర కమిటీ పిలుపునిచ్చింది.
హనుమాన్ జయంతి స్పెషల్
హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా అంటారు[1]. సంప్రదాయం ననుసరించి హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు ఈ జన్మోత్సవం జరుపుటను కూడా ఉంది.
జన్మ వృత్తాంతము
ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన పుంజికస్థల అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు “వానరస్త్రీ” గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు “హనుమంతునికి” జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము. ఆ శాపకారణంగా “పుంజికస్థల” భూలోకమందు వానరకన్యగా జన్మించి “కేసరి” అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన “శ్రీ ఆంజనేయస్వామి” కి తిరుమల లోని అంజనాద్రి పై జన్మ ఇచ్చింది.
News by : V.L

