క్షీరసాగర మథనం

హిందూ మతం లో పుట్టినవారు ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన కథ
దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. ఇదే గాథ రామాయణం లోని బాలకాండ లోను మహాభారతం లోని ఆది పర్వము లోను కూడా స్పృశించబడుతుంది. ఇదే ఇతిహాసము పురాణాలు లలో కూడా చెప్పబడింది. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది.
క్షీరసాగర మథనానికి పూనుకోవడానికి కారణం
రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి “ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి. వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం(పాల సముద్రం చిలకండి) జరపండి” అని చెబుతాడు. “ఆ మథనానికి కవ్వంగా మందరగిరి ని వాడండి. త్రాడు గా వాసుకి ని వినియోగించండి. ఆ మథన సమయం లో అమృతం పుడుతుంది. దానిని మీరు ఆరగించి, క్లేశాలు వారికి మిగల్చండి” అని విష్ణువు సెలవిస్తాడు.
ఆమాటలు విని, దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకువస్తుంటే బలి చక్రవర్తి వారిని వారిస్తాడు. ఆ తరువాత అలా కాలం వెళ్లబుచ్చుతున్న సమయంలో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతాడు. దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు.
క్షీరసాగర మథనం ప్రారంభించడం
మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనదై క్రింద పడబోతే శ్రీ మహా విష్ణువు గరుడారూఢుడై వచ్చి, మందరగిరిని క్షీర సాగరములో వదిలాడు. వాసుకిని ప్రార్థించి వాసుకికి అమృతంలో భాగమిస్తామని చెప్పి, ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా ఆ మంధరగిరి క్రిందనిలిచే ఆధారము లేక క్షీరసాగరము లోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి, ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు. మంధరగిరితో మథనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చింది. ఆరొదకు ఎన్నో జీవరాశులు మరణించాయి.
ఎడమ గుడు మనువు దిరుగుచు
గుడి నెడమను వెనుక దిరుగు కులగిరి కడలిన్
గడ వెడాల సురలు నసురులు
హాలాహలం పుట్టడం- శివుడు ఆ మహావిషాన్ని సేవించడం

అలా చిలుకుతుండగా ముందు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసంలో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి, క్షీరసాగర మథనం జరుపుతుండగా వచ్చినదానిని అగ్రతాంబూలంగా స్వీకరించుమని ప్రార్థించగా శివుడు హాలాహలం అని గ్రహించి పార్వతితో సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకొన్నాడు. గరళాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. కాని, గరళం శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. దానిని తట్టుకోవదం కోసం నిత్యం నెత్తి పైన నీళ్లు అభిషేకించుకుంటూ ఉండడమే మందు. అక్కడికీ తాపం అణగడానికి క్షీరసాగర మథనం లోనుంచి పుట్టిన చంద్రుడిని శివుడు తలపైన పెట్టుకొన్నాడు; గంగమ్మతల్లిని నెత్తిపైన ఉంచుకొన్నాడు. అయినా తాపం ఇబ్బంది పెడుతోనే ఉంటుందిట శివుడిని. కనుకనే, భక్తులు శివలింగానికి నిత్యం ఉదకాభిషేకం చేస్తూ ఉంటారు.
దొడితోడొ ఫణిఫణము మొదలు దెది యును దిగువన్
భూతాత్మ!భూతేశ!భూతభావనరూప!దేవ!మహాదేవ! దేవవంద్య
యీలోక ములకెల్ల నీశ్వరుండవు నీవ బంధ మోక్ష ములకు బభ్రడ వీప
యార్త శరణ్యండదగు గురుండవు నిన్ను గోరి భజింతురు కుశలమతులు
సకల సృష్టి స్థితిసంహార కర్త వై బ్రహ్మవిష్ణు శివాఖ్య బరగు దీవు
పరమ గుహ్యమైఅన బ్రహ్మంబు సదసతామంబుయ్ నీవశక్తి మయుడవీవ
శబ్ధ యోని విపరీత జగదంతరాత్మవు నీవ ప్రాణ మరయు నిఖిలమునకు
నీయందు సంభవించును
నీయందు వసించి యుండు నిఖిల జగంబుల్
నీయంద లయము బొందును
నీయుదరము సర్వభూత నిలయము రుద్రా
శిక్షింతు హాలహలమును
భక్షింతును మధూర సూక్ష్మ ఫలరసము క్రియన్
రక్షింతు బ్రాణికోట్లను
వీక్షింపుము నేడు నన్ను వికచాబ్జముఖీ
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రమ్ము నెంత మది నమ్మినదో
లక్ష్మీదేవి మొదలైన ఎన్నో వస్తువులు పుట్టడం-లక్ష్మీ కళ్యాణం

ఆ తరువాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మథనం ప్రారంభించారు. మథనం జరుపుతుండగా కామధేనువు పుట్టింది. తరువాత ఉచ్చైశ్రవము, ఐరావతం, కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు, మహాలక్ష్మి పుడతారు. కామదేనువును, కల్పవృక్షాన్ని, ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకొంటాడు. ఉచ్చైశ్రవాన్ని బలి చక్రవర్తికి ఇస్తారు.
క్షీరసముద్రంలో లక్ష్మీదేవి అవతరణ…..తొలుకారు మెఱుఁగు కైవడితళతళ యని మేను మెఱయ ధగధగ యనుచున్గలుముల నీనెడు చూపులచెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టె నృపా!పాలమున్నీటిలోపలి మీఁది మీగడ మిసిమి జిడ్డునఁజేసి మేనువడసిక్రొక్కారుమెఱుఁగుల కొనల తళుక్కుల మేనిచేగల నిగ్గుమెఱుఁగు చేసినాఁడునాఁటికిఁ బ్రోది నవకంపుఁ దీఁగెల నునుఁబోద నెయ్యంబు నూలుకొలిపిక్రొవ్వారు కెందమ్మి కొలఁకులఁబ్రొద్దునఁ బొలసిన వలపులఁ బ్రోదివెట్టి
పాలసముద్రపు మీది మీగడతో బ్రహ్మ లక్ష్మీదేవి శరీరాన్ని చెసాడట…క్రొమ్మేఘపు మెరుపులు ఆమె మేను మెఱుగుగా కుర్చడట..పసిఁడిచంపకదామంబు బాగుఁ గూర్చిబ్రాలు క్రొన్నెల చెలువున వాఁడి దీర్చిజాణతనమునఁ జేతుల జిడ్డివిడిచి నలువ యీ కొమ్మనొగిఁజేసినాఁడు నేడు
మహాలక్ష్మి పుట్టినవెంటనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు.కట్టంగ పచ్చని పట్టుపుట్టము దోయి ముదితకుఁ దెచ్చి సముద్రుఁడిచ్చెమత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁగాంచన కేయూర కంకణ కింకిణీ కటకాదులను విశ్వకర్మ యిచ్చెభారతి యెక మంచితారహారము నిచ్చెఁబాణిపద్మము నిచ్చెఁబద్మభవుఁడు
సముద్రుడు ఆమెకు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు. విశ్వకర్మ సువర్ణ అలంకారలు ఇస్తాడు. ఆమె వైపే ఓర చూపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీ దేవి (శ్రీదేవి), దేవదానవులతో, “మీ ఎవ్వరితో చేరినా సుఖం ఉండదు. శ్రీమహావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగళి గా ఉంటాను” అని చెప్పి మహావిష్ణువు మెడలో పూల మాల వేసింది. అప్పుడు సముద్రుడు కౌస్తుభమణిని తీసుకొని విష్ణువుకి ఇచ్చాడు. విష్ణువు ఆ కౌస్తుభమణితో పాటు మహాలక్ష్మిని తన వక్ష స్థలం పై విరాజిల్లచేశాడు.మ్రోసెన్ శంఖ మృదంగ వేణు రవముల్ మున్నాడి పెంజీఁకటుల్వాసెన్ నర్తన గానలీలల సురల్ భాసిల్లిరార్యుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మ రుద్ర ముఖరుల్ దల్లింగమంత్రంబులంబ్రాసక్తిన్ వినుతించి రుల్లసిత పుష్పశ్రేణి వర్షింపుచున్
దేవదానవులు మళ్లీ మథనం ఆరంభించారు. అప్పుడు వారుణి (సుర లేదా కల్లు) పుట్టింది. వారుణి తమకు కావాలని రాక్షసులు అడుగగా వారుణిని దానవులకు ఇస్తారు. క్షీరసాగర మథన సమయంలో ఎన్నో అనర్ఘమైన వస్తువులు ఉద్భవించాయి. అన్నింటినీ దేవతల లోని ముఖ్యులు పంచుకున్నారు. రాక్షసులకు మాత్రం సురాభాండాన్ని ఇచ్చారు, స్వేచ్ఛగా సురను త్రాగి, సాగర మథనం చేసిన శ్రమను పోగొట్టుకోవడానికి (కాబోలు) .

News by : V.L
