షుగర్ పేషెంట్స్ చేయకూడని 5 పొరపాట్లు, క్లియర్ గా చెప్పిన డాక్టర్

షుగర్ వచ్చిన వాళ్లు..ప్రీ డయాబెటిస్ స్టేజ్ లో ఉన్న వారు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లతో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కొన్ని చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల లక్షణాలు పెరిగిపోతాయి. ఆ సమయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. లేదంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ మరింత పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే డాక్టర్ అఖిల జోషి కొన్ని వివరాలు చెప్పారు. డయాబెటిస్ ఉన్న వారు అసలు చేయకూడని ఓ 5 పనుల గురించి వివరించారు. అవేంటో వివరంగా తెలుసుకుంటే చాలా వరకూ అప్రమత్తంగా ఉండవచ్చు.
వీలైనంత వరకూ డయాబెటిస్ రాకుండానే చూసుకోవాలి. ఎందుకంటే ఇదో దీర్ఘకాలిక వ్యాధి. ఓసారి వచ్చిందంటే అంత సులువుగా తగ్గించుకోవడం కుదరదు. లక్షణాలను కంట్రోల్ చేసుకుంటూ పోవడం తప్పించి మరో మార్గం కూడా ఉండదు. అందుకే షుగర్ వచ్చిన వాళ్లు ఎక్కువ రోజుల పాటు మందులు వాడాల్సి వస్తుంది. పూర్తిగా రివర్స్ చేసేందుకు అవకాశం లేకపోయినా కేవలం తీవ్రతను తగ్గించుకోడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. కొన్ని అలవాట్లు కూడా ఇందుకు దారి తీస్తాయి. అవేంటో క్లియర్ గా ఓ డాక్టర్ వివరించారు. ముఖ్యంగా ఓ 5 అలవాట్ల గురించి ఆమె చెప్పారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
షుగర్ పెరగడానికి దారి తీస్తున్న 5 కారణాలలో మొదటి దాని గురించి చెప్పారు డాక్టర్ అఖిల జోషి. అదేంటంటే.. డీహైడ్రేషన్. అంటే నీరు సరిగ్గా తాగకపోవడం. సరైన విధంగా నీళ్లు తీసుకోకపోతే బాడీ డీహైడ్రేషన్ కి గురి అవుతుంది. డీహైడ్రేషన్ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. సరైన విధంగా అది ఫిల్టర్ చేయడానికి వీలుండదు. అంతే కాదు. డీహైడ్రేషన్ వల్ల మలబద్ధకం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే..నీరు సరిగ్గా తాగకుండా షుగర్ కంటెంట్ అధికంగా ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలా ప్రమాదం. చక్కెర అంతా పేరుకుపోతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అదే వాటర్ కంటెంట్ శరీరంలో ఎక్కువగా ఉంటే యూరిన్ లేదా చెమట ద్వారా ఈ షుగర్ అనేది బయటకు వెళ్లిపోతుంది. తద్వారా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఎప్పుడైతే బాడీ డీహైడ్రేషన్ కి గురవుతుందో అప్పుడు శరీరంలో సరిపడా నీరు లేక షుగర్ అంతా అలాగే ఉండిపోతుంది.కొంత మందికి అనారోగ్యకరమైన ఆకలి ఎక్కువగా ఉంటుంది. అంటే..ఎంత తింటున్నారో ఓ లెక్క పత్రం లేకుండా తినేస్తుంటారు. ఎక్కువ మోతాదులో రైస్ తింటుంటారు. కేవలం రైస్ అనే కాదు. ఏం తిన్నా సరే..అతిగా తింటారు. కొంత మంది ఏమనుకుంటారంటే ఆరోగ్యకరమైన ఆహారం అయితే ఎంతైనా తినవచ్చు అని. కానీ ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా సరే మోతాదు మించి తీసుకోకూడదు అని చెబుతున్నారు డాక్టర్ అఖిల జోషి.
ముఖ్యంగా డయాబెటిస్ తో ఇబ్బంది పడే వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అతిగా తినకూడదు అని సూచిస్తున్నారు. సాధారణంగా భోజనం చేసిన తరవాత రక్తంలో షుగర్ ఎక్కువ మొత్తంలో విడుదల అవుతుంది. ఆ సమయంలో ఈ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే భోజనం చేసిన తరవాత తప్పనిసరిగా కనీసం ఓ పది నిముషాలు అయినా వాకింగ్ చేయాలని సూచిస్తుంటారు వైద్యులు. ఇలా చేయడం వల్ల రక్తంలోకి ఎక్కువగా గ్లూకోజ్ విడుదల కాకుండా ఉంటుంది.ఇప్పుడున్న లైఫ్ స్టైల్ లో సరైన నిద్ర దొరకడమే గగనమైపోయింది. చాలా మంది కంటి నిండా నిద్రపోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి వరకూ అలాగే ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు. ఎప్పుడో కానీ నిద్రపోవడం లేదు. మళ్లీ ఆఫీస్ హడావుడి వల్ల ఉదయమే నిద్రలేచి పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఎప్పుడో ఓసారి నిద్ర తగ్గింది అంటే పరవాలేదు. కానీ ఇలా రెగ్యులర్ గా అలవాటైతే మాత్రం మెటబాలిజం పూర్తిగా మారిపోతుంది.
నిద్రలేమి కారణంగా చాలా సమస్యలు
వస్తాయి. ముఖ్యంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. చిరాకు, స్ట్రెస్ కూడా పెరుగుతాయి. కళ్ల కింద నల్లటి వలయాలు, ముఖం ముడతలు పడడం లాంటి సమస్యలూ ఎదురవుతాయి. అంత కన్నా ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ తప్పనిసరిగా 6 గంటలకు పైగానే నిద్రపోవాలి. లేదంటే బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా తయారవుతుంది. ఫలితంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
