దొంగగా మారిన పోలీసు.. బావమరిదితో కలిసి

ప్రజల ఆస్తి, ప్రాణాలు కాపాడటం కోసం పోలీసు డిపార్ట్మెంట్లోకి వచ్చిన ఓ వ్యక్తి దొంగగా మారాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న అతడు, తన బావమరిది నాగసాయితో కలిసి దొంగతనాలకు పాల్పడసాగాడు. తాజాగా సింహపురి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ప్రియాంక అనే యువతి ఐఫోన్ 15 దొంగతనానికి గురవడంతో.. ఈ దొంగ కానిస్టేబుల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇతడిని రిమాండ్కు తరలించారు. పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ..
రుద్యోగులు, పని పాటా లేని వారు దొంగతనాలు చేస్తున్నారంటే ఓ అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ప్రజలకు కాపు కాసే పోలీసు శాఖలో కొలువు చేస్తున్నాడు. ప్రజా సొత్తును రక్షించాల్సిన ఆ వ్యక్తే.. దొంగగా మారి.. చోరీలకు పాల్పడసాగాడు. ఈ పనిలో తన బావమరిదిని భాగస్వామిగా చేసుకున్నాడు. బావ, బావ మరిది ఇద్దరు కలిసి గత కొన్నాళ్లుగా దొంగతనాలకు పాల్పడుతూ.. అలా దోచుకున్న డబ్బులతో జల్సాలు చేయసాగారు. ఈ క్రమంలో ఓ యువతి ఇచ్చిన సమాచారంతో ఈ పోలీసు దొంగ గురించి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
జల్సాలకు అలవాటు పడ్డ ఓ పోలీసు కానిస్టేబుల్ తన బావమరిదితో కలిసి దొంగతనాలకు పాల్పడసాగాడు. ఈక్రమంలో తాజాగా రైల్వే పోలీసులు ఇతడి గుట్టు రట్టు చేశారు. ఖమ్మం పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, మణికొండకు చెందిన ప్రియాంక అనే మహిళ ఐఫోన్ 15 మూడు రోజుల క్రితం అనగా శనివారం నాడు దొంగతనానికి గురైంది. విజయవాడ వెళ్లడం కోసం ఆమె సింహపురి ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తుండగా.. ప్రియాంక ఐఫోన్ చోరీకి గురైంది. దీని గురించి ఆమె డోర్నకల్ రైల్వే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈక్రమంలో తన మొబైల్ చోరీకి గురైన నాడు.. తాను ప్రయాణం చేస్తున్న బోగీలో అనుమానాస్పదంగా తచ్చాడిన ఇద్దరు వ్యక్తుల గురించి పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియాంక ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించారు. శనివారం నాడు ప్రియాంక ప్రయాణిస్తున్న బోగీలో ఉన్న ప్రయాణికుల గురించి దర్యాప్తు చేయసాగారు. ఈక్రమంలో అనుమానితులుగా భావించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిని విచారించగా ప్రియాంక ఐఫోన్ తామే దొంగతనం చేసినట్లు అంగీకరించారు. ఇక నిందితుల వివరాలు ఆరా తీయగా.. వీరిలో ఒకరు పోలీసు కానిస్టేబుల్ అని తెలిసింది. ఫోన్ దొంగతనం చేసిన వారిలో ఓ వ్యక్తి రాచకొండ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్గా పని చేస్తున్న యరమడి రవీందర్ అని తెలిసింది. గతంలో ఇతడు సికింద్రాబాద్ జీఆర్పీలో విధులు నిర్వర్తించాడు.
సికింద్రాబాద్ జీఆర్పీలో పని చేస్తున్నప్పటి నుంచే అతడు జల్సాలకు అలవాటు పడ్డాడు. జీతం డబ్బులు సరిపోకపోవడంతో ఖర్చుల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇక ఈ పనిలో భాగస్వామిగా తన బావమరిది మేకల నాగసాయిని కలుపుకున్నాడు. ఇద్దరూ కలిసి దొంగతనాలు చేస్తూ.. జల్సాలు చేయసాగారు. నిందితులిద్దరిని సోమవారం నాడు అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమత్తం కాజీపేట రైల్వే కోర్టుకు పంపారు.

