రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. భక్తిని కూడా క్యాష్ చేసుకుంటున్నారు.. ఈ కాల్స్తో జాగ్రత్త

సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు భక్తి పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పేరు చెప్పి, అమ్మవారి పట్టు చీరలు ఇంటికి పంపిస్తామని, ప్రత్యేక పూజలు చేస్తామని నమ్మించి డబ్బులు గుంజుతున్నారు. అధికారులు అప్రమత్తమై, ఇలాంటి ఫోన్ కాల్స్ను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచిస్తున్నారు. అధికారిక వెబ్సైట్, మనమిత్ర వాట్సాప్ ద్వారానే సేవలు పొందాలని ఆలయ ఈవో భక్తులకు సూచించారు.

