Spread the love

Bumper offer for 10th grade students.. Free 10 grams of gold.. Good chance, hurry up

టెన్త్ విద్యార్థులకు బంపరాఫర్.. ఫ్రీగా 10 గ్రాముల బంగారం.. మంచి ఛాన్స్, త్వరపడండి

  • ఉంగుటూరు జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు
  • టెన్త్‌లో ఫస్ట్ వచ్చిన వారికి 10 గ్రాముల గోల్డ్
  • 6 నుంచి 9వ తరగతి వారికి కూడా ఇస్తారు

పదో తరగతి విద్యార్థులకు ఓ బంపరాఫర్.. ఫస్ట్ వస్తే బంగారం గెలుచుకోవచ్చు. కృష్ణా జిల్లా ఉంగుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంది. పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 10 గ్రాముల బంగారం బహుమతిగా ఇస్తానని పారిశ్రామికవేత్త గుత్తా సుమన్‌ కుమార్‌ ప్రకటించారు. సుమన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలంలో ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు జెడ్పీ హైస్కూల్‌కు లక్ష రూపాయల విలువైన క్రీడా సామాగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ బహుమతుల వెనుక ఉద్దేశ్యమని సుమన్ కుమార్ తెలిపారు.

జెడ్పీ స్కూల్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు ఆయా తరగతుల్లో వార్షిక పరీక్షల్లో ఫస్ట్‌ ప్లేస్ సాధించిన వారికి.. ఏ తరగతి చదివితే అన్ని గ్రాముల బంగారం అందిస్తానని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఎంఈవో సాంబశివరావు సుమన్‌కుమార్‌ను సత్కరించారు. సుమన్ ఫౌండేషన్ ద్వారా తనకు తోచిన విధంగా ఇలా సాయం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సుమన్ ప్రకటించిన ఈ బహుమతి ఆసక్తికరంగా ఉంది. సుమన్ ప్రకటించిన రూ.10 గ్రాముల బంగారం విలువ దాదాపు రూ.లక్షా 62 వేల వరకు ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top