- ట్రక్కు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి
- మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలు
- ఈ దుర్ఘటన బాధాకరమన్న జగన్
పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఈ ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

